
కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్పై బీజేపీ వేటు.. పార్టీ నుంచి సస్పెన్షన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ను బీజేపీ నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్సీ అశోక్ కుమార్ అగర్వాల్, అతని భార్య కతిహార్, మేయర్ ఉషా అగర్వాల్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, నేర చరిత్ర ఉన్న నాయకులను తిరస్కరించాలని పిలుపునివ్వడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. కాగా అశోక్ అగర్వాల్ తన కుమారుడిని ప్రతిపక్ష కూటమి తరఫున నిలబెట్టడం కూడా బహిష్కరణకు దారితీసింది.




