T20 ప్రపంచ కప్లో ఇంగ్లండ్తో గురువారం జరిగే మ్యాచ్లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ తీస్తే, అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్ల క్లబ్లో చేరతారు. ఈ ఘనత సాధించిన 8వ భారత బౌలర్గా ఆయన నిలుస్తారు. ఇప్పటివరకు టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20ల్లో 116 వికెట్లు తీశారు. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) అత్యధిక వికెట్లు తీయగా, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (717), కపిల్ దేవ్ (687), రవీంద్ర జడేజా (634), జహీర్ ఖాన్ (610), జవగళ్ శ్రీనాథ్ (551) ఉన్నారు.