దీపావళి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి చిన్నారులు, పెద్దలు టపాసులు కాల్చుతూ సందడి చేస్తున్నారు. అయితే బాణాసంచా పేల్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- టపాసులు కాల్చేటప్పుడు కంటిలో ఏదైనా పడితే వెంటనే శుభ్రం చేసుకోవాలి.
- పటాకులకు గ్యాస్ సిలిండర్లు, నూనె పదార్థాలకు దూరంగా ఉంచాలి.
- పటాకులు వెలిగించే స్థలం నుంచి కనీసం 5 మీటర్ల దూరంలో ఉండాలి.
- పిల్లలను ఒంటరిగా టపాసులు కాల్చనివ్వొద్దు