TG: మేడారం జాతరలో ఆర్టీసీ సేవలు ఘోరంగా విఫలమయ్యాయి. సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడం, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి 7 గంటలకు బస్టాండ్కు చేరుకున్నా ఉదయం వరకు బస్సు రాలేదని ఆగ్రహించిన భక్తులు, ఉదయం వచ్చిన బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. మేడారం జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.