TG: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ తీర్పు ఆధారంగా.. నవంబర్ 7న కేబినెట్ సమావేశం నిర్వహించి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ ఎన్నికలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ నవంబర్ 3న విచారణకు రాగా.. ధర్మాసనం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఈ నెల 7న జరిగే కేభినేట్ భేటీలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయవచ్చననే ప్రచారం జరుగుతోంది.