కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తెలంగాణా, ఆంధ్ర, ఛత్తీస్ గడ్ సరిహద్దులో హై అలెర్ట్ ప్రకటించి, పెద్ద ఎత్తున భద్రతా బలగాలు, పోలీసులు మోహరించారు. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులను మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది.