TG: ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించ తలపెట్టిన 'రైతు ఆశీర్వాద' సభను రద్దు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా ఈ సభను రద్దు చేసింది. రేపు సాయంత్రం 4 గంటలకు శిల్ప కళా వేదికలో 'రైతు భరోసా' సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 'రైతు భరోసా' నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.