యూపీలోని ఘాజియాబాద్లో పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇందిరాపురం PS పరిధిలో దుర్గా పూజా మండపం బయట ఒక బాలుడిని ఓ కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఆ బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.