TG: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో థార్ వాహనం బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ చెరువుకట్టపై అతివేగంతో దూసుకొచ్చి పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడితో పాటు ఓ యువతి ప్రాణాలు కోల్పోయారు. వాహనం ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. చెరువులో పడి యువతి చినపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.