యూపీలోని ఘజియాబాద్ కవి నగర్ రాంలీలా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. ఓ వ్యక్తి ఫెయిర్ గేటులో నుంచి కారుతో చొరబడ్డాడు. అనంతరం ఓ దుకాణం బయట నిద్రిస్తున్న వ్యక్తుల పై నుంచి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు స్పందించి కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.