TG: కామారెడ్డిలో 10 మంది
కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా ట్రోల్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు BNS, ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.