TG: హైదరాబాద్ రాయదుర్గం పోలీస్స్టేషన్లో దర్శకుడు రామ్గోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. ‘దహనం’ వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్లో అంజనా సిన్హా పేరును ఆర్జీవీ ప్రస్తావించారు. కొన్ని సన్నివేశాలు అంజనా సిన్హా చెప్పిన విధంగా తీశామన్నారు. దీంతో తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరును వాడారని అంజనా సిన్హా ఫిర్యాదు చేశారు.