సీబీఎస్ఈ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించిన పది, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై మార్చి 10న ముగియనున్నాయి. పన్నెండో తరగతి పరీక్షలు కూడా అదే నెలలో ప్రారంభమై ఏప్రిల్ 9న ముగుస్తాయంది. ఈ షెడ్యూల్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు తమ ప్రిపరేషన్ను వేగవంతం చేయాలని బోర్డు సూచించింది.