CBSE క్లాస్ 12 ఫలితాలపై దేశవ్యాప్తంగా వచ్చిన వివాదాల నేపథ్యంలో బోర్డు ఇవాళ్టి నుంచి రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఇటీవల అమలు చేసిన ఆన్-స్క్రీన్ మార్కింగ్, డిజిటల్ మూల్యాంకన విధానంలో లోపాలు ఉన్నాయని
విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దాదాపు 4 లక్షల మంది
విద్యార్థులు తమ మార్కులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుమారు 11 లక్షల జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం.