రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్
ఇండియా(సీసీఐ) మొదటి చీఫ్ ధనేంద్ర కుమార్ కన్నుమూశారు. న్యూఢిల్లీలో బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం జరిగి ఆయన చనిపోయారు. ఎయిర్ కండీషనర్ పేలి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కుమార్ ఇంటికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.