కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలయ్యే సినిమాలకు సైతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ధృవీకరణను తప్పనిసరి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సత్లుజ్’ సినిమా చుట్టూ ముసిరిన వివాదమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఐటీ నిబంధనలు-2021లో కీలక సవరణలు తీసుకురానున్నట్లు జాతీయ మీడియా సమాచారం. దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ సినిమాకు సీబీఎఫ్సీ కొన్ని కట్స్ సూచించింది.