పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రణాళికలు ఏమీ లేవని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని వస్తున్న ఊహాగానాలను కేంద్రం ఖండించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెట్రోల్ ధరలు పెరుగుతాయనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.