కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో కర్ణాటక పోలీసులు 12 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. 380 పేజీల నివేదికను సీసీబీ అధికారులు బెంగళూరు కోర్టులో సమర్పించారు. ప్రధాన నిందితులుగా సూపర్స్టార్ దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ్ ఉన్నారు. అభిమాని హత్య కేసులో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని రమ్య చేసిన పోస్ట్పై దర్శన్ అభిమానులు ఆమెను దూషించారు. 43 సోషల్ మీడియా ఖాతాలపై రమ్య ఫిర్యాదు చేయగా, ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు.