Top 10 viral news 🔥

కాశీబుగ్గ తొక్కిసలాట.. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం: జగన్
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గత 18 నెలలుగా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. ఇది చంద్రబాబు అసమర్థపాలనకు నిదర్శమని జగన్ మండిపడ్డారు.




