చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా టికెట్ ధరల పెంపుపై జారీ చేసిన మెమోకు సంబంధించిన విచారణ వాయిదా పడింది. సంక్రాంతి నేపథ్యంలో హైకోర్టుకు సెలవులు ఉండటంతో ఈ అంశంపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సెలవుల అనంతరం రావాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. దీంతో టికెట్ రేట్ల పెంపు మెమోపై న్యాయపరమైన విచారణ తాత్కాలికంగా వాయిదా పడినట్లైంది.