AP: ఎన్టీఆర్ జిల్లా, బాపులపాడు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థిపై దుర్భాషలాడటంతో, ఆగ్రహించిన విద్యార్థి అతడిపై పిడిగుద్దులతో దాడి చేశాడు. చిన్న కారణంతో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.