ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అమిటీ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న షాకింగ్ ఘటన అందరినీ కలవరపెడుతోంది. విశ్వవిద్యాలయ క్యాంపస్ పార్కింగ్ స్థలంలో ఓ విద్యార్థిని తన క్లాస్మేట్పై దాడి చేసింది. కారులో కూర్చోబెట్టి తోటి విద్యార్థులతో కలిసి ఒక నిమిషం వ్యవధిలోనే 26 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్గా మారింది. బాధిత విద్యార్థి బీఎ LLB రెండో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. ఈ గోడవకు గల కారణాలు తెలియరాలేదు.