హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని, ఇరాన్ పోర్టులను కూడా అడ్డుకుంటామని
అమెరికా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 112 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ఇరాన్ ఎగుమతులపై ఆంక్షలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం ధరల పెరుగుదలకు కారణమవుతుండగా, ఈ తాజా పరిణామం సరఫరాను మరింత తగ్గించి, సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూసివేస్తే, ప్రపంచానికి మరింత ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.