కర్ణాటకలోని బెంగళూరులో శనివారం KPCC కార్యాలయంలో
కాంగ్రెస్ శాసనసభ్యుల (CLP) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డీకే శివకుమార్ను సీఎల్పీ నేతగా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో
కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఢిల్లీ నుండి AICC పరిశీలకులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా బెంగుళూరు చేరుకున్నారు. సీఎల్పీ నేత ఎన్నిక పూర్తయిన తర్వాత డీకే శివకుమార్, ఇతర
కాంగ్రెస్ నేతలు గవర్నర్ను కలవనున్నారు.