TG: అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికపై చర్చిస్తున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అధికారులు, కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.