TG: హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ ఇంటర్వ్యూకు సెలక్ట్ అయిన 20 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. కాగా సివిల్స్కు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ గాంధీ అభయహస్తం పథకం కింద సాయం అందజేస్తోంది. సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటి.. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు ఈ అభయహస్తం అర్ధికంగా తోడ్పడుతుంది.