TG: జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు మహారాష్ట్రతో చర్చలు జరిపేందుకు జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 148 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి పాటిల్కు తెలియజేశారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.