ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన వివిధ జిల్లాల్లో ప్రజలను ఉద్దేశించి సభలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.