రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే చోట కలిసి కనిపించారు. హైదరాబాద్లోని RFCలో జరుగుతున్న 'రామోజీ ఎక్స్లెన్స్' జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పక్కపక్కనే కూర్చున్న వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వులు చిందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.