TG: పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐకాస (బీసీ జేఏసీ) ఆధ్వర్యంలో రేపు(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రావాల్సిన రూ.7 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదన్నారు.