TG: ప్రభుత్వం రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి బంద్ ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 6 నుంచి కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అత్యవసరంగా సమావేశం కానున్నాయి. పెండింగ్ బకాయిలపై కార్యాచరణను ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నాయి. కాగా బకాయిలను విడుదల చేయాలని సెప్టెంబర్ 15 నుండి కాలేజీల నిరవధిక బంద్కు కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.