TG: సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిగా అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాలన, సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని ఆమె కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.