తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 'తులం బంగారం' హామీ అమలుపై కసరత్తు చేస్తోంది. 2023 ఎన్నికల నాటికి, 2026 నాటికి బంగారం ధర దాదాపు రెట్టింపు అయింది. అప్పట్లో తులం బంగారం సుమారు రూ.50,000 - రూ.60,000 ఉండగా.. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,000కి చేరింది. రాష్ట్ర ఆదాయం తగ్గడం, బంగారం ధరలు పెరగడం వల్ల పథకం అమలులో జాప్యం జరుగుతోందని మంత్రులు తెలిపారు. ఈ పథకం కింద వివాహం చేసుకునే ఆడబిడ్డలకు రూ.1 లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.