AP: తూ.గో. జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో వివాదం చోటు చేసుకుంది. పోటీ నిర్వాహకులు తనకు అన్యాయం చేశారని యువ బాక్సర్ హేమంత్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. భవనంపైకి ఎక్కి దూకేందుకు సిద్ధపడ్డాడు. తోటి బాక్సర్లు హేమంత్ను అడ్డుకున్నారు. అనుభవం లేని రిఫరీలను నియమించి పోటీలు నిర్వహిస్తున్నారని హేమంత్ ఆరోపించారు. పోటీ నిర్వహణపై కోచ్లు, బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.