TG: రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ ఎండీని మంత్రి ఆదేశించారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు.