ఆగస్టు 4 నుండి సీపీగెట్ పరీక్షలు

54చూసినవారు
ఆగస్టు 4 నుండి సీపీగెట్ పరీక్షలు
TG: రాష్ట్రంలోని యూనివర్శిటీల పరిధిలో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన సీపీగెట్ పరీక్షలు ఆగస్టు 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం వెల్లడించారు. ఈ పరీక్షలు మొత్తం 45 సబ్జెక్టుల కోసం నిర్వహించబోతున్నామని, దరఖాస్తుల సమర్పణకు గడువు జులై 17 వరకు ఉండగా, రూ.500 ఆలస్య రుసుముతో జులై 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్