కోల్కతాలోని బెహలా పుర్బా నియోజకవర్గంలో జరుగుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భారత మాజీ
క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బాధ్యతగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.