TG: రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో బుగ్గిపాలైంది. నిర్మల్ జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకుని మొక్కజొన్న, వరి, జొన్న పంటలు బూడిదయ్యాయి. దీంతో రైతులు విలపిస్తున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. బాధిత రైతులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.