మళ్లీ పెరుగుతోన్న క్రూడాయిల్ ధరలు

87చూసినవారు
మళ్లీ పెరుగుతోన్న క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య దాడులతో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. దీని ప్రభావం హార్ముజ్‌లో నౌకల రవాణాపై పడుతోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర మళ్లీ పెరుగుతోంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 79 డాలర్లకు దూసుకెళ్లింది. ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడుతుండటంతో ఇవాళ ఒక్కరోజే ధర ఏకంగా 4.30 శాతం పెరిగింది. దాంతో  భారత్‌లో డీజిల్, పెట్రోల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.

సంబంధిత పోస్ట్