ఐపీఎల్-2026 మినీ వేలంలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ సంచలనం సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన డొమెస్టిక్ ప్లేయర్గా ప్రశాంత్ వీర్ నిలిచారు. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అతడి కోసం పోటీ పడినా, చివరికి చెన్నై అతడిని సొంతం చేసుకుంది. ఈ ఏడాది UP-T20లో 10 మ్యాచ్లలో 320 పరుగులు చేసి, 8 వికెట్లు తీసి ప్రశాంత్ వీర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు.