
AI హబ్, టీ స్క్వేర్పై సీఎం రేవంత్ సమీక్ష (వీడియో)
హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా AI హబ్, టీ-స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. సాంకేతికత ఆధారంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.




