
12వ తరగతిలో టాపర్.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 23 ఏళ్ల రియా కుమారి అనే విద్యార్థిని మంగళవారం ఉదయం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె 1999 కార్గిల్ యుద్ధ వీరుడి కుమార్తె. పోలీసులు గది నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో 'ఐ లవ్ యూ, మమ్మీ, పాపా.. ఎవరి తప్పు లేదు' అని రాసి ఉంది. పోలీసు అధికారి అంకిత్ ఖండారి ప్రకారం, రియా చదువుల్లో విజయం సాధించలేకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురై ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణురాలు కాలేదని సమాచారం. 12వ తరగతిలో 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్గా ఆమె, నీట్ రీ-ఎగ్జామ్ కోసం సిద్ధమవుతుంది.




