భారత మహిళా జట్టు, దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో దీప్తి శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. టీమ్ఇండియా బ్యాటర్ దీప్తి శర్మ 53 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం క్రీజులో దీప్తి శర్మ (50), రిచా ఘోష్ (33) ఉన్నారు. మారిజాన్ కాప్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 48 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 286/5గా ఉంది.