ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన భయానక దృశ్యాలను మిగిల్చింది. పేలుడు తీవ్రతతో మృతదేహాలు ఛిద్రమై వందల మీటర్ల దూరంలో పడ్డాయి. తాజాగా ఘటనాస్థలం నుంచి సుమారు 1000 అడుగుల దూరంలో లజపతిరాయ్ మార్కెట్లోని ఓ దుకాణం పైకప్పుపై తెగిపడిన చేయిని గుర్తించారు. ఫోరెన్సిక్ అధికారులు ఆ అవశేషాలను స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షలకు పంపారు. ఈ ఘటనలో హైగ్రేడ్ పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు నిపుణులు నిర్ధారించారు.