ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టయిన ఉత్తరప్రదేశ్ మహిళ షాహీన్ ఫోటో బయటకొచ్చింది. అధికారులు ఆమెను విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో షాహీన్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్ను సులభతరం చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది.