
SSMB29 ఈవెంట్.. ఆస్ట్రేలియా నుంచి HYD వచ్చిన ఫ్యాన్
రాజమౌళి-మహేశ్బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB29 సినిమా ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి సునీల్ ఆవుల అనే అభిమాని 6817 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నారు. 12 గంటల విమాన ప్రయాణం తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న అతన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ ఈవెంట్లో సినిమా టైటిల్, స్పెషల్ విజువల్స్, మహేశ్ లుక్ విడుదల కానున్నాయి. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఈ అభిమాని డెడికేషన్ను ప్రశంసించారు.




