ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఘోరమైన రికార్డును సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 75 పరుగులకే కుప్పకూలింది. కేవలం 13 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ పవర్ప్లే స్కోరు నమోదు చేసింది. రెండు రోజుల క్రితం 264 పరుగులు చేసిన జట్టు ఇలా ఆడటం అభిమానులను షాక్కు గురిచేసింది.