తెలంగాణను హరిత శక్తి సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మోడల్ సోలార్ విలేజ్” కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఆదివారం అసెంబ్లీ హాల్లో ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, MLCలకు ఆయన వ్యక్తిగతంగా లేఖలు అందజేశారు. ప్రతి ప్రజాప్రతినిధి తన సొంత గృహంలో కిలోవాట్ గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.