ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు తృటిలో ప్రమాదం తప్పింది. లక్నో నుంచి కౌశాంబి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్లో సాంకేతిక లోపం వల్ల ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై హెలికాప్టర్ను లక్నో ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. డిప్యూటీ సీఎం సహా సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడ్డారు.