నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో పార్వతీ రామలింగేశ్వర జాతరలో అపశృతి చోటుచేసుకుంది. అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరగడంతో పలువురు భక్తులు నిప్పులగుండంలో పడి గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులకు గాయాలవగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జాతరలో కలకలం సృష్టించింది.